ఇంటింటా జగన్ పేరు మారుమ్రోగుతోంది…
ఆర్.బి.ఎం: గ్రామాలలోని ప్రతి ఇంటా సీఎం జగన్ పేరు మారుమ్రోగుతోంది.గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి ఇంటింటి పర్యటనలో మీరు ఏయే పథకాలు లబ్దిపొందారని శ్రీకాంత్ రెడ్డి అడుగుతుంటే… అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలును సీఎం జగన్ ప్రవేశపెట్టడం వల్లనే తమ పిల్లలను ధైర్యంగా చదివించు కోగలుగుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు.ఇక రైతులైతే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి నిధి అందిస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతింటే ..ఆ సీజన్ ముగిసే లోగానే బీమా, ఇన్ ఫుట్ సబ్సిడీ లును అందించి సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని రైతులు ఆనందంగా వివరిస్తున్నారు.సీఎం జగన్ ఏర్పాటు చేసిన గ్రామ, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తమకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని తెలిపారు.వైఎస్ఆర్ ఆసరా తో తమ జీవితాలలో జగనన్న వెలుగులు నింపారని ప్రతి ఇంటా డ్వాక్రా అక్కచెల్లెమ్మలు శ్రీకాంత్ రెడ్డి కి తెలిపారు. డ్వాక్రా రుణాలును పూర్తిగా మాపీ చేస్తామని చంద్రబాబు నాయుడు మోసాగించారని , అదే జగనన్న చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలును విడతల వారీగామాపీ చేస్తూ మాట మీద నిలబడ్డారన్నారు.45 నుంచి సంవత్సరాల మధుర వయస్సుగల వారికి చేయూత క్రింద రూ 18,750 లును అందిస్తున్నా రన్నారు. డ్వాక్రా రుణాలకు సున్నా వడ్డీని అందిస్తూన్నారంటూ ప్రతి ఇంటా శ్రీకాంత్ రెడ్డికి అక్క చెల్లెమ్మలు తెలువుతూ సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచున్నారు.ప్రతి ఇంట్లో కూడా రెండు మూపథకాలుకు పైగా లబ్దిపొందామని చెప్పుచున్నారు. ఎవ్వరి రేకమెండేషన్ లేకుండానే తమ తమఅర్హతల ప్రకారం తమ ఇళ్లవద్దకే పథకాలును జగనన్న పంపిస్తున్నారని, ఇలాంటి సంక్షేమ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, సీఎం జగన్ మేలు మరువలేమంటూ వివిధ పథకాల ద్వారా లబ్దిపొందిన ప్రజలు సంతోషంగా శ్రీకాంత్ రెడ్డి కి తెలిపారు.