కుల్కచర్లలో ఓ కుటుంబాన్ని తుపాకులతో బెదిరించిన దుండగులు…
వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. కుల్కచర్ల కళామగుడి వద్ద ఓ కుటుంబాన్ని తుపాకులతో బెదిరించిన దుండగులు. భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరించి నాలుగున్నర తులాల బంగారం,నగదు, ఫోన్లు ఎత్తికెళ్లారు. ఈ ఘటనతో కుల్కచర్ల ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.