హైదరాబాద్: బిర్యానీ కోసం ఓ వ్యక్తి అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశాడు. ఎన్ని గంటలు హోటళ్లు తెరిచి ఉంచాలో చెప్పాలని కోరాడు. మహమూద్ అలీ పోలీసులకు బాస్.. అందులో అర్థరాత్రి ఫోన్ చేసి అది కూడా బిర్యాని హోటళ్లు ఎన్ని గంటల వరకు తెరిచి ఉంచాలని అడగడంతో ఆయనకు చిర్రెత్తు కొచ్చింది. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. తాను రాష్ట్రానికి హోం మంత్రినని, బిర్యానీ పంచాయతీ ఎమిటని మండిపడ్డారు. నేరు హోటల్ వాడిని కాదు, నాకు వంద టెన్షన్లు ఉంటాయి. అర్ధరాత్రి ఫోన్ చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. 11 గంటలకే హోటళ్లు మూసేస్తారని చెప్పి ఫోన్ కట్ చేశారు. మరోవైపు అర్ధరాత్రి వరకూ బిర్యానీ విక్రయాల కోసం అనుమతి ఇవ్వాలని ఎంఐఎం నేతలు హైదరాబాద్ సీపీని కలిశారు. అర్ధరాత్రి విక్రయాలకు అనుమతి ఉండాలని ఎంఐఎం నేతలు కోరారు.