అందరు జాగ్రత్తగా ఉండండి: చిరంజీవి
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా మహమ్మారి రోజు రోజుకు విపరీతంగా విజృంభిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు . కరోనా బారిన పడి ఎంతో మంది తమ ఆత్మీయులను పోగొట్టుకొని ఎంతగానో తల్లడిలుతున్నారు. ఈ మహమ్మారిని తమ చెంతకు చేరకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అయన కోరారు. సెకండ్ వేవ్ లో కరోనా అతి వేగంగా విస్తరిస్తోందని అయన అన్నారు. స్వీయ నియంత్రణతో దాని అరికట్టొచ్చని దీని పట్ల అందరు అప్రమతంగా ఉండాలని అయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వేరే దారి లేదంటూ ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకుకోవాలని చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా తెలిపారు.