నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్..

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును హైదరాబాద్ లోని తన స్వగృహంలో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణపై ఐపీసీ-ఏ 124 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీవీ ఛానెళ్లలో,సామజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాని భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో ఆయనను అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణ రాజును అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎపి సీఐడీ పోలీసులను మొదట్లో సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. వారి ఉన్నత అధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకోవడానికి ఒప్పుకుంటాం అని పోలీసులు తేల్చి చెప్పారు. కాగా రఘురామకృష్ణ రాజును బలవంతంగా తన ఇంటి నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని సమాచారం.   రఘురామకృష్ణ రాజు పుట్టిన రోజు నాడే ఆయనను అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయా అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.