నీళ్ల కోసం ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదు: పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్

నీళ్ల కోసం ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదు: పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నీటి సరఫరాను మరింత మెరుగుపరిచే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. నూతనంగా భాద్యతలు స్వీకరించిన జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్లు బౌధనగర్ డివిజన్ ప్రియాంక, అడ్డగుట్ట డివిజన్ ఇంజినీర్లు స్రవంతిలు మంగళవారం పద్మారావును కలిశారు. నీటి సమస్యల పై ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిక్షరించాలని పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు . ఆదే విధంగా సేవారేజ్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని అయన అన్నారు. కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని పద్మారావు గౌడ్ కోరారు . కరోనాను నిర్ములించేందుకు ప్రజల సహకారం ఎంతైనా ఉందని అయన తెలిపారు. కెసిఆర్ గారు రాష్ట్రంలో కరోనాను నియంత్రించేందు చర్యలు చెప్పటారని, ప్రజలు కారొనపై భయం విడి అవగాహనా తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం రమణ రెడ్డి, డీజీఎం కృష్ణలు కార్పొరేటర్ సామల హేమ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.