విజయవాడ: కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్నారు. అనంతరం దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆదివారం మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ మోహన్ రెడ్డి దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలికి, అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎంకు మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని కూడా స్వాగతం పలికారు.