గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. గుహటి వేదికగా హోరాహోరిగా జరిగిన మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. దీంతో భారత్ జట్టు 16 పరుగుల తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. మూడు టీ20 సిరీస్లో భాగంగా 2-0 ఒక మ్యాచ్ మిగిలివుండగానే సిరిస్ సొంతం చేసుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ (22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 61), కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 57) దమ్ములేపే అర్ధ శతకాలతో..దుమ్ములేపారు. కోహ్లీ (28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్), రోహిత్ శర్మ (37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43) రాణించగా..చివర్లో దినేష్ కార్తీక్ కూడా మెరుపు షాట్లతో అలరించాడు. కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
అనంతరం..భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు..ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లోపడింది. అయితే..డికాక్, మిల్లర్ జట్టును ఆదుకున్నారు. డికాక్ (69 నాటౌట్), మిల్లర్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 నాటౌట్) సూపర్ సెంచరీ చేసి దుమ్ములేపారు. అయినా మ్యాచ్ గెలవలేకపోయింది. 20 ఓవర్లు అయిపోయేసరికి దక్షిణాఫ్రికా 3వికెట్లను కోల్పోయి 221 రన్స్ చేసింది.