రెచ్చిపోయిన బ్యాటర్లు.. సఫారీలకు ఓటమి..

గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. గుహటి వేదికగా హోరాహోరిగా జరిగిన మ్యాచ్‎లో భారత్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. దీంతో భారత్ జట్టు 16 పరుగుల తేడాతో సిరీస్‎ను కైవసం చేసుకుంది. మూడు టీ20 సిరీస్‎లో భాగంగా 2-0 ఒక మ్యాచ్ మిగిలివుండగానే సిరిస్ సొంతం చేసుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన టీమిండియా స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్‌ (22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), కేఎల్‌ రాహుల్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) దమ్ములేపే అర్ధ శతకాలతో..దుమ్ములేపారు. కోహ్లీ (28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్‌), రోహిత్‌ శర్మ (37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) రాణించగా..చివర్లో దినేష్ కార్తీక్ కూడా మెరుపు షాట్‎లతో అలరించాడు. కేఎల్‌ రాహుల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అనంతరం..భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు..ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లోపడింది. అయితే..డికాక్, మిల్లర్ జట్టును ఆదుకున్నారు. డికాక్ (69 నాటౌట్), మిల్లర్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 నాటౌట్‌) సూపర్‌ సెంచరీ చేసి దుమ్ములేపారు. అయినా మ్యాచ్ గెలవలేకపోయింది. 20 ఓవర్లు అయిపోయేసరికి దక్షిణాఫ్రికా 3వికెట్లను కోల్పోయి 221 రన్స్ చేసింది.

Leave a Reply

Your email address will not be published.