వికారాబాద్: బతుకమ్మ, దసరా పండుగకు ఊరికి వెళ్తే సమాచారం ఇవ్వాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే.. సొంత గ్రామాలకు, విహారయాత్రకు వెళ్లేవారు కొన్ని సూచనలు పాటించాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒకవేళ అనుమాన్సపదమైన వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక..ఇంట్లో విలువైన బంగారం, నగదు ఇంట్లో పెట్టి వెళ్లవద్దని సూచించారు.