కొత్తగా 358 మందికి కరోనా!
ఆర్.బి.ఎం డెస్క్: మరోసారి దేశంలో కరోనా వైరల్ జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో సుమారు 358 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి పెరుగుతూ వస్తుంది. కొత్త వేరియంట్ ప్రధానంగా కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 300 కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.