సుప్రీం కోర్టులో మురళీమోహన్ కు చుక్కెదురు..
ఆర్.బి.ఎం డెస్క్: జయభేరి అధినేత మురళీమోహన్ కు సుప్రీం కోర్ట్ లో చుక్కెదురైంది. ఎచ్.ఎం.డి.ఏ నిబంధలను అతిక్రమించిన కేసు నేపథ్యంలో మురళీమోహన్ కు సుప్రీం కోర్ట్ సమన్లు జారీ చేసింది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్ లోని జయభేరి సమస్త నుండి ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. మధుసూదన్ అనే వ్యాపారి జయభేరి సంస్థ నుండి కొనుగోలు చేసిన ప్లాట్ విషయంలో ఆ సంస్థ పలు అవకతవకలకు పాల్పడింది అని అయన సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసులో సుప్రీం కోర్ట్ లో ప్లాట్ కొనుగోలు చేసిన మధుసూదన్ కు తీర్పు అనుకూలంగా వచ్చింది.