పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మమత బెనర్జీ సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది.దీంతో ఆయన కలకత్తాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. అనుభవజ్ఞులైన వైద్యుల నేతృత్వంలో ఆయనకు చికిత్స అందించారు. గత కొద్ది రోజులుగా వైద్యులు పూర్తిస్థాయిలో ఆయనకు చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. కాగా ఈ రోజు ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన మృత్యువాత పడ్డారు. మమతా బెనర్జీ సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా బారినపడి మృతి చెందినట్లు అధికారికంగా ఆసుపత్రి చైర్మన్ అలోక్‌రాయ్‌ వెల్లడించారు. ఆషీమ్ బెనర్జీ అంతక్రియలు కరోనా నిబంధనల మధ్య ఈరోజు మధ్యాహ్నం మహా స్మశానం ఘాట్లో జరుగనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.ఆషీమ్ బెనర్జీ కరోనా బారినపడి మృతి చెందడంతో మమతా బెనర్జీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ఆషీమ్ బెనర్జీ మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published.