జిల్లా కేంద్రం ప్రకటనతో రాయచోటిలో అంబరాన్నింటిన సంబరాలు…
ఆర్.బి.ఎం రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ప్రకటనలో అన్నమయ్య జిల్లా కేంద్రంగాను, రెవెన్యూ డివిజన్ గా రాయచోటి పేరు ప్రకటనతో నియోజక వర్గ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.రాయచోటిలో బుధవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్లు దశరథ రామిరెడ్డి, ఫయాజుర్ రెహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ విజయ భాస్కర్, బేపారి మహమ్మద్ ఖాన్, జిన్నా షరీఫ్ లతో పాటు కౌన్సిలర్లు, వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని దుశ్శాలువాలు, గజమాలలతో ఘనంగా సత్కరించారు. జిల్లా కేంద్రం ఏర్పాటులో శ్రీకాంత్ రెడ్డి కృషికి అభినందనలు తెలిపడంతో పాటు జిల్లా ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి,ఎంపీ మిధున్ రెడ్డి సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డిలకు కృతజ్ఞతా భావాన్ని తెలుపుతూ జేజేలు పలికారు.అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి ప్రభుత్వ చీఫ్ విప్ తో కలసి పాలాభిషేకం నిర్వహించారు.