భక్తి భావం పెంపొందాలి: ప్రభుత్వ ఛీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి

భక్తి భావం పెంపొందాలి: ప్రభుత్వ ఛీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం: ప్రజలందరిలో భక్తిభావం పెంపొందాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.శనివారం గాలివీడు మండలం గోరాన్ చెరువు గ్రామం దాసరి వాండ్ల పల్లె లో నూతనంగా నిర్మించిన సీతారాముల, అసర్ల గంగమ్మ తల్లీ ఆలయాలలో వేర్వేరుగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

భగవంతుడి దయతో సంవృద్దిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు పాడిపంటలతో కల కళలాడాలని, సుఖ సంతోషాలుతో విరజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందించి ఛీప్ విప్ ను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లా సుదర్శన్ రెడ్డి,సింగిల్ విండో అధ్యక్షులు వేదమూర్తి రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆవుల నాగభూషన్ రెడ్డి,మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, సర్పంచ్ లు ఉమా పతి రెడ్డి, కేశవరెడ్డి, దీప్తి,ఉమా ప్రభాకర్,మాజీ ఎంపిటీసీ దాసరి చిన్న రెడ్డి, ఎంపీటీసీ లు శ్రీను,చిన్న రెడ్డి,గడ్డం చంద్ర ప్రకాష్ రెడ్డి,వైసీపీ నాయకులు వెంకటాద్రి, బ్రహ్మానంద రెడ్డి, మద్దిరాల భానుమూర్తి రెడ్డి,నల్లా బత్తుని రమణా రెడ్డి, జల్లా ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.