భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు ఛత్రపతి శివాజీ: బి.జనార్దన్ రెడ్డి, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి

భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు ఛత్రపతి శివాజీ: బి.జనార్దన్ రెడ్డి, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి

ఆర్.బి.ఎం వికారాబాద్: చత్రపతి శివాజీ మహారాజు 393వ జయంతిని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇన్చార్జి జనార్దన్ రెడ్డి,మాజీ మంత్రి చంద్రశేఖర్ రావు, జిల్లా అధ్యక్షులు సదానందం రెడ్డి,వికారాబాద్ పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ ధీరత్వాన్ని కొనియాడారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే చత్రపతి శివాజీ జయంతి నేడు అని జనార్దన్ రెడ్డి అన్నారు. యువత ఛత్రపతి శివాజిని ఆదర్శంగా తీసుకోవాలని జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్నికి పూలమాల వేసి జనార్దన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published.