విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి: మహేష్ గౌడ్,శంకర్పల్లి సిఐ

విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి: మహేష్ గౌడ్,శంకర్పల్లి సిఐ

ఆర్.బి.ఎం శంకర్పల్లి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడా రంగంలో రాణించాలని శంకర్పల్లి సిఐ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 2న విశాఖపట్నంలో నిర్వహించిన ఏసియన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శంకర్పల్లి కరాటే మాస్టర్ పి శ్రీనివాస్ విద్యార్థులను శంకర్పల్లి సీఐ మహేష్ గౌడ్ అభినందించారు.

ఈ నేపథ్యంలో సిఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ చాంపియన్షిప్ లో శంకర్ పల్లి మున్సిపల్ పరిధి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించడం తమకు గర్వకారణంగా ఉందని సీఐ మహేష్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థి విద్యార్థినిలు చదువుతో పాటు ఆత్మ రక్షణలో కూడా ముందుండాలని సిఐ మహేష్ గౌడ్ విద్యార్థులకు సూచించారు. ప్రత్యేకంగా ఆడపిల్లలు ఆత్మరక్షణ వంటి క్రీడలు నేర్చుకోవాలని సిఐ మహేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు. శంకర్పల్లి పోలీసుల సహాయ సహకారాలు ఎల్లవేళలా మీకు ఉంటాయని విద్యార్థులకు ఈ సందర్భంగా సిఐ మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు.

గెలుపొందిన విద్యార్థులతో సినీ నటుడు సుమన్,కరాటే మాస్టర్ పి.శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published.