శ్రీవారి హుండీలో చోరీకి యత్నం..
తిరుమల తిరుపతి శ్రీవారి హుండీలో నుండి డబ్బులు చోరీకి యత్నిచిన యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీవారి హుండీలో చేయి పెట్టి రూ.30వేల అపహరిస్తుండగా అక్కడి సీసీ కెమెరాలో అంత రికార్డు అయింది. చోరీని గుర్తించిన విజిలెన్సు అధికారులు నిందుతుడిని పట్టుకొని తిరుపతి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. శ్రీవారి హుండీలో నగదు తీయడం ఇదే మొదటిసారా లేక ఇంతకు ముందు కూడా చోరీకి పాల్పడడ ఇంకా వారి సహచరులు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు నిందితుడ్ని విచారిస్తున్నారు. ఎంతో పవిత్రంగా భావించే హుండీలో నుండి ఆలా చోరీ కావడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.