హైదర్ గూడలో వివాహిత దారుణ హత్య..
రాజేంద్రనగర్: మానవత్వం మంటగాల్సి పోతుంది అనే దానికి ఉదాహరనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడాలో చోటు చేసుకున్న దారుణ ఘటన కట్టుకున్న భర్తే యముడై ప్రాణాలను హరించాడు. వివరాల్లోకి వెళ్తే రవి ఆటో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తుంటాడు భార్య సమత 26 సంవత్సరాలు అదిలాబాద్ లోని ఆసిఫాబాద్ ప్రాంత వాసులుగా గుర్తించిన రాజేంద్రనగర్ పోలీసులు హైదర్ గూడాలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగించేవారు గత పది రోజులుగా రవి విచ్చలవిడిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య సమత మందలించి మద్యం సేవించకూడదని వారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు తెలిపారు. నిన్నటి వరకు సమత అమ్మ వాళ్ళింట్లో రవి తో పాటు కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉన్నారని తెలిపారు. రవి సమత ల వివాహం జరిగి మూడు సంవత్సరాలు అయిందని వీరికి ఒక బాబు ఉన్నాడు. జీవితం యథేచ్ఛగా జరుగుతుండగా ఒక్కసారిగా ఇద్దరి మధ్యలో వాగ్వాదం చోటుచేసుకుంది గత అర్ధరాత్రి సమత నీ రవి అతి కిరాతకంగా హత్య చేశాడు. సమత అన్నయ్య ఆమెకు ఫోన్ కాల్ చేయడం తో స్పందించక పోవడం వలన రవికి కి ఫోన్ చేసి చెల్లి ఫోన్ ఎత్తడం లేదని చెప్పాడు కాసేపటి తర్వాత రవి సమత అన్నయ్య శ్రీకాంత్ కి కాల్ చేసి మీ చెల్లి డోరు తీయడం లేదని తొందరగా నువ్వు రావాలని రవి చెప్పాడు. సంఘటన స్థలానికి సమత అన్నయ్య శ్రీకాంత్ చేరుకునేసరికి రక్తపుమడుగులో పడి ఉండడం చూసి పెద్దగా అరిచేసరికి స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందజేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ సిఐ కనకయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంతో పూర్తి ఆధారాలు సేకరించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసారు. హత్యకు గల కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమోఅన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.