పల్లపు నరసింహులు మృతి పార్టీకి తీరని లోటు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..
ఆర్.బి.ఎం: ఎం పి పి పల్లపు రాజమ్మ మామ, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్ తండ్రి నరసింహులు అనారోగ్యంతో మృతి చెందారు. పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లెలోని వారి నివాసంలో ఉంచిన పల్లపు నరసింహులు భౌతిక కాయాన్ని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష ,జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎం పి పి పోలు సుబ్బారెడ్డి లతో కలసి శుక్రవారం ఉదయం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని మృతిపట్ల సంతాపం తెలిపారు. నరసింహులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తుకుతెచ్చుకుని అతని మృతి పార్టీకి తీరని లోటన్నారు.
కసిరెడ్డి నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆనంద్ రెడ్డి, మాధవరం రమేష్ రెడ్డి, అమరనాధ రెడ్డి, వై ఎస్ ఆర్ టి ఎఫ్ నేత రెడ్డెప్ప రెడ్డి, కుంచపు ప్రసాద్, ప్రతాప్, ఇడగొట్టు నాగరాజ, పల్లపు సుబ్బరాయుడు తదితరులు నివాళులు అర్పించారు.