సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం: శ్రీకాంత్ రెడ్డి

సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం: శ్రీకాంత్ రెడ్డి

  • సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే సేవలు
  • గాలివీడు మండలం అరవీడు గ్రామ సచివాలయ నూతనభవన ప్రారంభంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం:   సీఎం జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గాలివీడు మండలం అరవీడు గ్రామ సచివాలయ నూతన భవన ప్రారంభంలో స్థానిక సర్పంచ్, నాయకులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ప్రజల ముంగిటకే సేవలు అందిస్తూ భరోసానిస్తోందన్నారు. సచివాలయ అధికారులు, సిబ్బంది , వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్నారన్నారు. నిర్దేశిత సమయం కన్నా ముందుగానే ప్రజలకు సేవలు అందుతు న్నాయన్నారు. సచివాలయాల్లో జవాబుదారితనం, పారదర్శకంగా సేవలు అందుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published.