లబ్దిదారుల ఇళ్ళ వద్దకే చేరుకొని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజెసిన ఉప సభాపతి పద్మారావు గౌడ్..

లబ్దిదారుల ఇళ్ళ వద్దకే చేరుకొని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజెసిన ఉప సభాపతి పద్మారావు గౌడ్..

ఆర్.బి.ఎం : మారేడుపల్లి రెవిన్యూ మండలం పరిధిలో మెట్టుగూడ డివిజన్ పరిధిలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. విజయపురి, మేట్టుగూడ, చింత బావి, దూద్ బావి, మైలార్ గడ్డ తదితర ప్రాంతాల్లో లబ్దిదారుల ఇళ్ళ వద్దకే చేరుకొని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, cmrf చెక్కులను పద్మారావు గౌడ్ అందించారు. కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునిత, తెరాస యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్, తహసిల్దార్ సునీల్ కుమార్ తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కాగా తన పర్యటనలో భాగంగా వివిధ స్థానిక సమస్యల పై కుడా తీగుల్ల పద్మారావు గౌడ్ వెన్వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారి చేశారు. 17 చెక్కులను ఈ సందర్భంగా లబ్దిదారులకు అందించారు.

Leave a Reply

Your email address will not be published.