సి.ఐ వేధింపుల వల్ల ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య..
ఆర్.బి.ఎం: ఏలూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో యువకుని భార్య ఫిర్యాదు చేయగా సదరు స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ ఇవ్వకుండా 10లక్షలకు సెటిల్మెంట్ చేసుకోమని చెప్పటంతో తీవ్ర మనోవేదనకు గురైన యువకుడు దిక్కుతోచని స్థితిలో దెందులూరు రైల్వే ట్రాక్ పై సోమవారం తెల్లవారుజామున ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి శవ పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి మరణానికి కారణమైన వన్ టౌన్ సి. ఐ పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు ఆందోళన చెప్పటారు.