పవన్ కల్యాణ్‌ ఒక సైకో.. రెచ్చిపోయిన పోసాని

పవన్ కల్యాణ్‌ ఒక సైకో.. రెచ్చిపోయిన పోసాని

ఆర్.బి.ఎం హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శకుడు పోసాని కృష్ణమురళి రెచ్చిపోయారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పవన్ కల్యాణ్ ఒక సైకో అంటూ ధ్వజమెత్తారు. తన భార్యపై ఆరోణలు చేసి నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ నేను డీమోరలైజ్ కాను. పవన్ రోజూ నన్ను తిట్టు.. నేనిలానే బతుకుతా.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైమ్ లో నాకు, పవన్ మధ్య విభేదాలు వచ్చాయి. షూటింగ్ సమయంలో పవన్ నన్ను ఇబ్బందులు పెట్టారు’’ అని పోసాని తెలిపారు. పవన్‌ను కేసీఆర్ బహిరంగంగా హెచ్చరించారని. అప్పుడు పవన్ అభిమానులు ఎందుకు ఊరుకున్నారని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. పవన్‌పై విమర్శలు చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. తనను తిడుతూ 24 గంటల్లో కొన్ని వేల మెసేజ్‌లు వచ్చాయని తెలిపారు.

‘‘పవన్‌కల్యాణ్‌ ప్రజల మనిషి కాదు. ఇండస్ట్రీ మనిషి అంతకన్నా కాదు. కేవలం తనని తాను ప్రేమించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కి.మీ. నడిచిన జగన్‌తో పోల్చుకుంటారా? ప్రభుత్వ పాఠశాలలు ఎలా మార్పు చెందాయో ఎప్పుడైనా చూశారా? విద్యార్థులకు అన్నీ ఉచితంగా ఇవ్వటంతో పాటు, స్కూల్‌కు వెళ్లిన వాళ్లకు జగన్‌ ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తోంది. చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పులు చేసి, జగన్‌కు వదలి వెళ్లారు’’అని పోసాని కృష్ణమురళి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.