జగన్ తిరుమల శ్రీవారి ప్రసాదం తీసుకోలేదు: రఘురామ

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వరస్వామిని బుధవారం తెల్లవారుజామున దర్శించుకున్న విషయం తెలిసిందే. కాగా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ పై విమర్శలు గుప్పించారు. తిరుమల దర్శనం కోసం వచ్చిన జగన్ స్వామివారి ప్రసాదం తీసుకోలేదని విమర్శించారు. ఆయన క్రిస్టియన్ కదా..అది అందరికీ తెలిసిన విషయమే. ప్రసాదం ఎలా తీసుకుంటాడని ఎద్దేవ చేశారు. ఇక.. రాష్ట్రం మొత్తం అప్పులతో కురుకుపోయిందని అన్నారు. తప్పు చేసి అప్పుకూడు అన్నట్లుగా రాష్ట్ర సర్కార్ తీరు ఉందని విమర్శలు సందించారు. జగన్ సర్కార్ గత ఆరు నెలలో రూ.49 వేల కోట్ల అప్పు చేశారని అది నిజమేనా..కాదా..? అన్న సంగతి చెప్పాలని సీఎం జగన్ ను రఘురామ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published.