చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టాలి..!

చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టాలి..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై
ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై భయంతో మాట్లాడలేక రాష్ట్ర ప్రభుత్వాని తప్పుబడుతున్నారు అని అయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని వారికీ ఆ కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారని విజయసాయి రెడ్డి వెల్లడించారు. కరోనాపై ప్రజలకు అవగాహాన కల్పించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ఆలా చేయకుండా కరొనపై ప్రజలను భయానికి గురిచేస్తున్నారు అని అయన అన్నారు. ఇలాంటి విపత్క సమయంలో చంద్రబాబు రాజకీయాలు చేయడం నీచమని అయన అన్నారు. కరోనా పై ప్రజలను భయపెడుతున్న చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టాలి అంటూ ఘాటుగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సంగం డెయిరీలో కోట్ల రూపాయలు తిన్న ధూళిపాళ్ల అరెస్టును తట్టుకోలేక ప్రతిపక్ష నేత ఇలా దిగజారి మాట్లాడుతున్నారని అయన అన్నారు. చంద్రబాబు కు సంబందించిన అవినీతి పరులను కరోనా విపత్తు సమయంలో అరెస్టు చేయకుండా వదిలేయాలని పత్తిగింజలా నీతి చంద్రికలు బోధిస్తున్నారని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా భగ్గుమన్నారు.

Leave a Reply

Your email address will not be published.