ప్రొబేషనరీ డిక్లరేషన్ అంశంపై చీఫ్ విప్ ను కలసిన సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు…

ప్రొబేషనరీ డిక్లరేషన్ అంశంపై చీఫ్ విప్ ను కలసిన సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు…

ఆర్.బి.ఎం: ప్రొబేషనరీ డిక్లరేషన్ అంశంపై నియోజకవర్గ పరిధిలోని గ్రామ సచివాలయం వెల్ఫేర్ అండ్ ఏడ్యుకేషనల్ అసిస్టెంట్లు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని కలిసి తమకు ప్రభుత్వం ప్రొబేషరీ డిక్లరేషన్ కోసం పెడుతున్న పరీక్షను రద్దు చేయించి ప్రొబేషన్ ను డిక్లేర్ చేయించాలని విన్నవించారు. ఇందుకు చీఫ్ విప్ స్పందించి సచివాలయ ఉన్నతాధికారులు అజయ్ కల్లం,హర్షవర్ధన్ లతో చరవాణి ద్వారా దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. ప్రొబేషనరీ డిక్లేర్ కి డిపార్ట్మెంట్ టెస్ట్ కి సంబధం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి వెల్ఫేర్ అసిస్టెంట్స్ అసోసియేషన్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్స్ సంఘ నాయకులు చింతం శ్రీకాంత్ రెడ్డి, పెద్ది రాజు, గణేష్,ప్రభాకర్ నాయక్, వెంకటేశ్వర బాబు, వెంకటేశ్వర్లు, జ్ఞానదీప్ రెడ్డి,సుధీర్,హరిత,శివాని మౌనిక, శివారెడ్డి, నాగదేవ,హరిహర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.