ఆలయాలు నాగరికతకు ప్రతీకలు: శ్రీకాంత్ రెడ్డి
ఆర్.బి.ఎం: ఆలయాలు నాగరికతకు ప్రతీకలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మండలం గొర్లముదివేడు కస్పా లో నూతనంగా నిర్మించిన వినాయకుని ఆలయ ప్రారంబోత్సవంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని శివాలయం లోనూ, నూతన వినాయకుని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొర్లముడివేడు కస్పాలో మల్ రెడ్డి రామచంద్రా రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో వినాయకుని ఆలయం నిర్మాణం జరిపి గురువారం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు గావించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్ కు కార్యక్రమ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరిలో భక్తి భావాలు పెంపొందాలని ఆయన కోరారు. వినాయకుని కృపవల్ల వర్షాలు సంవృద్దిగా కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలుతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి త్వరితగతిన పూర్తిగా నశించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలును అత్యంత భక్తిశ్రద్ధలతో, కోవిడ్ నిబంధలుతో జరుపుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి గంగిరెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు రాజారెడ్డి,విశ్వనాధ రెడ్డి,విద్యార్తి విభాగపు నేత కిషోర్ దాస్, చలమారెడ్డి,కృష్ణారెడ్డి, చలమారెడ్డి, ఎం పి టి సి ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి, చింతల జనార్ధన రెడ్డి,శివ, మల్ రెడ్డి, రాము, నాగరాజ, మనోహర, సురేంద్ర వెంకటరమణ, కృష్ణయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
One Comment on “ఆలయాలు నాగరికతకు ప్రతీకలు: శ్రీకాంత్ రెడ్డి”