ఏపీ ముఖ్యమంత్రికి ఏప్రిల్ 1న కరోనా వాక్సిన్

ఏపీ ముఖ్యమంత్రికి ఏప్రిల్ 1న కరోనా వాక్సిన్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్ : విడతల వారీగా కరోనా వాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం పంపిణి చేస్తోంది. ఇప్పటికే తొలివిడతగా ఫ్రంట్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ రెండో విడతలో భాగంగా 55 ఏళ్ళు పైబడ్డవారికి వ్యాక్సిన్ ఇచ్చారు. మూడో విడతలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 45 ఏళ్ళ వారికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోబోతున్నారని సీఎంవో అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 1న ఉదయం 11.10 గంటలకు తొలి డోస్ వ్యాక్సిన్ గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాక్సిన్ వేయించుకుంటున్నటు సీఎంవో అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.