డియర్ హర్ష గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ఆనందం
ఆర్.బి.ఎం అమరావతి: సీఎం జగన్ కుమార్తె హర్షిణి మాస్టర్స్లో సత్తా చాటారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో హర్షిణి మాస్టర్స్ విద్యనభ్యసించారు. మాస్టర్స్లో హర్షిణి డిస్టింక్షన్తో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు మాస్టర్స్ పట్టా అందించారు. మాస్టర్స్ పట్టా స్నాతకోత్సవానికి జగన్ దంపతులు పారిస్ వెళ్లారు. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి పట్టా తీసుకున్నారు. వర్సిటీ నుంచి హర్షిణి పట్టా తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్షిణిపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు గుప్పిస్తున్నారు.
జగన్ తన కూతురు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘డియర్ హర్షా చాలా గర్వంగా ఉంది. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చింది. దేవుడు నీ పట్ల కృప చూపించాడు. డిస్టింక్షన్తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం నాకు గర్వంగా ఉంది. డిస్టింక్షన్తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది’అని జగన్ ట్వీట్ చేశారు.