రేపు జగన్‌తో గౌతమ్ రెడ్డి భేటీ… ఇంతలోనే విషాదం

రేపు జగన్‌తో గౌతమ్ రెడ్డి భేటీ… ఇంతలోనే విషాదం

ఆర్.బి.ఎం హైదరాబాద్: మంత్రి గౌతమ్ రెడ్డి వారం రోజుల పాటు దుబాయ్ పర్యటను విజయవంతగా ముగించుకుని ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పర్యటన వివరాలను సీఎం జగన్‌కు వివరించేందుకు అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. రేపు జగన్‌ను కలిసేందుకు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. దుబాయ్ పర్యటన ద్వారా ఏపీకి రూ. 5,015 కోట్ల పెట్టుబడులను గౌతమ్ తీసుకొచ్చారని సమాచారం. దుబాయ్ పర్యటన వివరాలు.. పెట్టుబడులపై జగన్‌కు వివరించేందుకు గౌతమ్ రెడ్డి నోట్‌ను కూడా సిద్దం చేసుకున్నారు. ఇంతలో ఆయనకు గుండెపోటు రావడం.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.

గౌతమ్ రెడ్డి మరణానికి పోస్ట్ కొవిడ్ పరిణామాలే కారణమని చెబుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాజీ ఎంపీ మేకతోటి రాజగోపాల్‌రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. విద్యాధికుడైన గౌతమ్ రెడ్డి.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గౌతమ్ రెడ్డి మరణవార్త విన్న ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.