చెప్పలేనంత బాధగా ఉంది.. గౌతమ్ రెడ్డి మృతితో పెను విషాదంలో జగన్

చెప్పలేనంత బాధగా ఉంది.. గౌతమ్ రెడ్డి మృతితో పెను విషాదంలో జగన్

ఆర్.బి.ఎం: మంత్రి గౌతమ్ రెడ్డి మృతితో సీఎం జగన్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గౌతమ్ రెడ్డి మరణంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని సీఎం పంచుకున్నారు. తనకు మొదటి నుంచి సుపరిచితుడని గుర్తుచేశారు. తన మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం చెప్పలేనంత బాధగా ఉందని చెప్పారు. గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులకు జగన్ ప్రగాడ సానుభూతి తెలిపారు.

గౌతమ్ రెడ్డి మృతితో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అపోలో ఆసుపత్రి నుంచి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన ఇంటికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని అక్కడ ఉంచుతారు. అనంతరం నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని తరలిస్తారు. బుధావారం నెల్లూరులో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.