రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు..

రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు..

రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష మాట్లాడుతూ మనిషిని మహోన్నుతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటేనని, అందరికీ విద్యఅందేలా కృషి చేసిన తత్వవేత్త,సంఘసంస్కరణ కర్త మహాత్మా జ్యోతీరావు పూలే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయభాస్కర్, బేపారి మహమ్మద్ ఖాన్, జిన్నా షరీఫ్, కౌన్సిలర్లు గౌస్ ఖాన్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,ఫయాజ్ అహమ్మద్, సుగవాసి శ్యామ్,షబ్బీర్, జానం రవీంద్ర యాదవ్ , గువ్వల బుజ్జిబాబు, ఆర్ట్స్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.