రాయచోటి ఆర్టీసి రీజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు..

రాయచోటి ఆర్టీసి రీజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు..

ఆర్.బి.ఎం: అన్నమయ్య జిల్లా ఆర్టీసి రిజన్ పరిధిలో డిపోల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసినట్లు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. శనివారం సాయంత్రం అన్నమయ్య జిల్లా రీజనల్ మేనేజర్ జగదీష్ రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి ని గౌరవ సూచకంగా కలిశారు. డిపోకు పరిమితంగా ఉన్న రాయచోటిలో రీజనల్ స్థాయి కార్యాలయం రావడం అభినందనీయం అనారు.

ఈ సందర్భంగా రూ.2.5 కోట్లతో రాయచోటి ఆర్టీసి బస్టాండ్ విస్తరణ పనులపై చర్చించారు. జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాగానే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు సిద్దమైనట్లు చర్చించారు. దిపో పరిధిలో ఎక్కువగా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయని వాటి స్థానంలో కొత్త బస్సుల ఏర్పాటు విషయంపై ఆర్టీసి ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, మంత్రి విశ్వరూప్ లతో ఎమ్మెల్యే ఫోన్ ద్వారా మాట్లాడారు.

త్వరలో వెయ్యి కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నామని అందులో స్థానిక అధికారుల నివేదికల ఆధారంగా బస్సుల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అలాగే రిజనల్ పరిధిలోని రాయచోటి, మదనపల్లె 1, 2, పీలేరు, రాజంపేట డిపోల పరిధిలో ఉన్న బస్సులు వాటి కండీషన్లు, ఇతర అభవృద్ధి విషయంపై నివేదిక తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తానని రీజనల్ మేనేజర్ తెలిపారు. వీరి కలయికలో రాయచోటి డిపో మేనేజర్ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.