కబడ్డీ క్రీడకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం
ఆర్.బి.ఎం: కబడ్డీ క్రీడకు ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కబడ్డీ సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా గురువారం పార్టీసీఫెషన్ సర్టిఫికెట్లును ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చేతులమీదుగా అందచేశారు.ఈ సందర్భంగా కబడ్డీ క్రీడాకారులుకు శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న జిల్లా స్థాయి ప్రో కబడ్డీ పోటీలను అందరి సహకారంతో విజయవంతం చేద్దామన్నారు.క్రీడా ప్రాంగణాల నిర్మాణాలకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికార సంస్థ చీఫ్ కోచ్ షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు.