అల్లూరి ఆరాధ్యుడు: జగన్

అల్లూరి ఆరాధ్యుడు: జగన్

భీమవరం: తెలుగుజాతికి అల్లూరి సీతారామరాజు ఆరాధ్యుడని, అందుకే జిల్లాల పునర్విభజనలో మన్నెం జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని సీఎం జగన్ తెలిపారు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవరం జరిగిన అల్లూరి జయంత్యుత్సవాల సభకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశాన్ని మరొక దేశం.. ఒక మనిషిని మరో మనిషి.. ఒక జాతిని మరో జాతి దోపిడీ చేసే సమాజాన్ని నిర్మూలించాలని జాతి నేతలు కలలు కన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ బాట పట్టారు. మార్గాలు వేరైనా అందరి లక్ష్యం ఒక్కటే. అటువంటి యోధులలో అల్లూరి ఒకరు.. అడవిలో అగ్గి పుట్టించిన యోధుడు. అల్లూరి సీతారామరాజు భావాలకు అనుగుణంగా విప్లవ వీరుడు.. కాని తెలుగు జాతికి, భారత దేశానికి స్ఫూర్తిప్రదాత, ఆరాధ్యదేవుడు ఇటువంటి మహనీయులను స్మరించుకోవడానికి ఆజాదీ కా అమృత్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం’’ అని జగన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.