4,722 ఉద్యోగాలకు నోటిఫికేషన్: హరీష్ రావు
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా విలయతాండవం చేసిన సందర్భంలో నర్సుల సేవలు వెల్లకట్టలేనివని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ నర్సుల దినోత్సవాని పురస్కరించుకొని గాంధీ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో త్వరలో 4,722 నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అయన తెలిపారు. తెలంగాణలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నసీనియర్ నర్సులకు మంత్రి హరీష్ రావు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ రమే్షరెడ్డి,ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ,ఉస్మానియా సూపరింటెండెంట్లు ప్రొఫెసర్ రాజారావు, నాగేందర్,డీఎంఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.