సిటీ పోలీసులకు శుభవార్త..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులకు సీపీ సీవీ ఆనంద్ శుభవార్త తెలిపారు. వెస్ట్జోన్ పరిధిలో ఉన్న పోలీస్స్టేషన్లలో బీపీ, షుగర్, అధిక బరువుతో బాధపడుతున్న వారు 60 శాతం మంది సిబ్బంది ఉన్నారని తెలిసిందని సీపీ సీవీ ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలో ఉన్న 17 వేల మంది సిబ్బందికి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అయన వెల్లడించారు. ఇన్స్పెక్టర్, ఆపై స్థాయిలో ఉన్న అధికారులతో కమిషనరేట్లో గురువారం సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపాలని అన్నారు. రోజూ సాయంత్రం 3 నుంచి 5 వరకు ఏసీపీ ఆపై స్థాయి అధికారి ఫిర్యాదులు స్వీకరించాలని అన్నారు. ఈ నేపథ్యంలో నోటీస్ బోర్డ్లను ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. గ్యాంబ్లింగ్ డెన్లపై సివిల్ వివాదాల్లో తలదూర్చడం కేసుల నమోదులో అలక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.