ఘోరం..22 ఆవుల దుర్మరణం..

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం బొబ్బిలి మండలంలో గొర్లిసీతారాంపురం సమీపంలో పశువుల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. రాయగడ నుంచి విజయనగరం వెళ్లే రహదారి గుంతలమయం కావడంతో లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఒరిస్సా నుంచి తెలంగాణకు అక్రమంగా ఆవులు తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆవుల కలేబరాల కుప్పలతో జాతీయ రహదారి భయానకంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.