వైఎస్ షర్మిల దీక్షకు పోలీసుల గ్రీన్ సిగ్నల్..

వైఎస్ షర్మిల దీక్షకు పోలీసుల గ్రీన్ సిగ్నల్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాజన్న రాజ్యంతోనే తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మళ్ళి తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తాం ఇప్పటికి వైఎస్ షర్మిల పలుసార్లు నిర్వహించిన సమేవేశాలలో వెల్లడించింది. ప్రత్యేక్య రాష్ట్రం ఏర్పడితే చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తాయి అన్ని ఎంతో ఆశతో ఉన్న నిరుద్యోగులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ నిరుద్యోగులను మోసం చేసారని మాట తప్పారని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారేమో అనుకుంటే కెసిఆర్ మాత్రం తమ కుటుంబ సభ్యులకు ఇచ్చారే తప్ప తెలంగాణలోని ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేరని ఇక ఇవ్వబోరని షర్మిల ఇది వరకే వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో నిరుద్యోగుల కోసం మూడు రోజులపాటు దీక్ష చేస్తా అంటూ ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల పేర్కొన్నారు. కాగా షర్మిల నిరుద్యోగుల కోసం చేపట్టబోయే దీక్షాకు షర్మిల వర్గీయులు అనుమతుల కోసం పోలీస్ అధికారులకు ఇప్పటికే విన్నతి పత్రం అందజేశారు. కాగా ఈరోజు షర్మిల ఉద్యోగుల కోసం చేప్పట్టబోయే దీక్షకు పోలీసులు అనుమతులు జారీచేశారు. విన్నతి పత్రంలో మూడురోజులు దీక్షకు అనుమతులు కోరగా పోలీసులు కరోనా నేపథ్యంలో షర్మిల చేప్పట్టబోయే దీక్షకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇందిరాపార్క్ వద్ద దీక్షాకు పోలీసులు అనుమతులు జారీచేశారు.

Leave a Reply

Your email address will not be published.