బండ్ల గణేష్ ను రెండోసారి పలకరించిన కరోనా..

బండ్ల గణేష్ ను రెండోసారి పలకరించిన కరోనా..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టాలీవుడ్ పరిశ్రమలో ఇప్పటికే పలువురు ప్రముఖులను కరోనా తన కోరల్లో వెస్కొని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే గతంలో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ రావడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా కొద్దీ రోజులకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు బండ్ల గణేష్. అయితే తాజాగా మళ్ళి గణేష్ కరోనా బారిన పడ్డారు అని తెలుస్తోంది. కరోనా సోకి అపోలో ఆస్పత్రి ఐసీయూ లో చికిత్స తీసుకుంటున్నారు అని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ గణేష్ కు కరోనా సోకిందని అధికారిక సమాచారం లేదు. కానీ గణేష్ కు కరోనా వచ్చిందనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న గణేష్ ఆ తర్వాత రోజు నుండి జ్వరం రావడంతో కరోనా నిర్దారణ పరీక్షా చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరారు గణేష్.

Leave a Reply

Your email address will not be published.