దుర్గాదేవికి ముస్లిం నేత పూజలు… చంపుతామని బెదిరింపు

అలీఘడ్: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ ముస్లిం బీజేపీ నేత తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఇదే ఆ నేతలకు పాలిట శాపంగా మారింది. కుటుంబాన్ని హతమారుస్తామంటూ దుండగుల నుంచి బెదిరింపులు వచ్చాయి. యూపీలోని అలీఘడ్‌కు చెందిన బీజేపీ నాయకురాలు రూబీ అసిఫ్ ఖాన్ తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. అయితే ఇది ఇస్లాం మతానికి విరుద్ధమని అందువల్ల ఆమెను, కుటుంబాన్ని హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతేకాదు బెదిరింపులతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు.

గతంలో రూబీ గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పుడు కూడా ఆమెకు ఫత్యా జారీ చేశారు. ఈ బెదిరింపులపై రూబీ అసిఫ్ ఖాన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పోలీసులు ఫిర్యాదు చేశారు. తన కుటుంబం హిందూ ముస్లిం ఐక్యత కోసం పాటుపడుతుందని రూబీ భర్త ఆసిఫ్ ఖాన్ చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏ దేవుడిని అయినా పూజించవచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం దుర్గాదేవికి పూజలు చేసిన రూబీకి హిందూ మహాసభ మద్ధతు ఇచ్చింది. దుర్గాదేవిని పూజించిన రూబీని పలు హిందూ సంస్థలు అభినందించాయి. రూబీకి దుర్గాదేవి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.