ఏడేళ్ల బాలికపై చిరుత పంజా..
తెహ్రీ (ఉత్తరాఖండ్): అభం శుభం తెలియని ఏడేళ్ల బాలిక చిరుత పంజాకు బలైన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ పట్టణంలో చోటుచేసుకుంది. ఇంట్లో అందరు పడుకున్న సమయంలో ఆ చిన్న పాపా వాష్ రూమ్ కోసం బయటికి వచ్చి తమ వాకిట్లో నిల్చుంది అప్పటికే చిరుత అక్కడ ఉంది దాని గ్రహించని ఆ పాపా వాకిట్లో నిలబడింది. ఆ పాపా ఇంట్లోకి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా చిరుత పాపా పై దూకి బలితీసుకుంది. పాపా అరుపులతో ఇంట్లో వాళ్ళు స్థానికులు లేచి చూసేవరకు పాపా చనిపోయింది. ఇదే గ్రామంలో ఇప్పటికే నెల వ్యవధిలో చిరుత ఐదుగురిని బలితీసుకుంది. చిరుత దాడిలో మరణించిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని డీఎఫ్ఓ డీఎస్ మీనా తెలిపారు.