లక్కిరెడ్డిపల్లె మోడల్ స్కూల్ విద్యార్థులుతో కలసి భోజనం చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..
ఆర్.బి.ఎం: ప్రభుత్వ పాఠశాలల్లో రుచిగా, నాణ్యతగా జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం అందాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అధికారులుకు సూచించారు. శనివారం శ్రీకాంత్ రెడ్డి లక్కిరెడ్డిపల్లె లోని మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి భోజనం చేశారు. కూరలు,అన్నం రుచిగా ఉంటాయా… ఏయే రోజు ఏమేమి మెనూ ఉంటుందని ఆయన విద్యార్థులును ఆడిగితెలుసుకున్నారు. జగనన్న గోరుముద్ద రుచిగా ఉందంటూ విద్యార్థులు తెలుపుతూ, మా ఆకలి తీరుస్తున్న సీఎం జగన్ మామయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచున్నా మన్నారు. విద్యార్థులుతో కలసి భోజనం చేయడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.