బీజేపీ నేత సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలి: శ్రీకాంత్రెడ్డి
ఆర్.బి.ఎం కడప: తమ మనోభావాలను కించపరిచేలా బీజేపీ నేత సోమువీర్రాజు మాట్లాడారని విప్ శ్రీకాంత్రెడ్డి తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదరికంలో మగ్గుతూ ఇతర ప్రాంతాల వారు.. బాగుండాలనుకునే కడపజిల్లా వారు కోరుకుంటారని తెలిపారు. సోమువీర్రాజు వ్యాఖ్యలను వెంటనే వెనెక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్లకు, రాజకీయా నాయకులు తమను కించపరచోద్దని సూచించారు. ఈ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే మీటింగ్లు పెట్టొద్దన్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ, కడప జిల్లా మీద సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసేలా సోమువీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని ఆక్షేపించారు. కడప గుండాలు, కడప రౌడీలు, పులివెందుల పంచాయతీ అని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతారని, రాయలసీమ సంస్కృతి తెలుసుకుని మాట్లాడాలన్నారు. మనుషులను చంపుకునే కడప వారికి ఎయిర్పోర్ట్ ఎందుకనడం దారుణమని శ్రీకాంత్రెడ్డి అన్నారు.