రఘురామకృష్ణం రాజుకు బెయిల్ మంజూరు..
ఆర్.బి.ఎం డెస్క్: ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆరోగ్యపరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా రఘురామకృష్ణం రాజు ఎలాంటి టీవీ డిబేట్ లలో ఇంటర్వ్యూలలో మాట్లాడకూడదని కోర్ట్ షరతులు విధించింది. కాగా సిఐడి విచారణకు సహకరించాలని రఘురామకృషం రాజుకు సుప్రీంకోర్టు సూచించింది. రఘురామకృష్ణం రాజు విచారణకు 24 గంటల ముందే నోటీసులు ఇవ్వాలని సుప్రీం కోర్ట్ పేర్కొంది. రఘురామకృష్ణం రాజు తన గాయాలను టీవీలో చూపించకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.