అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతికి బయలుదేరారు. భార్య భారతితో కలిసి తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అక్కడ భార్యతో కలిసి ప్రత్యేక విమానం ఎక్కారు. సీఎం ఎక్కిన విమానం నేరుగా తిరుపతి సమీపంలోని రేణిగుంటకు కాకుండా హైదరాబాద్ మీదుగా రేణిగుంట చేరుకుంటుంది. ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్..భారతితో కలిసి హైదరాబాద్ లో దిగనున్నారు. బేగంపేటలో భారతిని డ్రాప్ చేసిన తర్వాత జగన్ అదే విమానంలో రేణిగుంట వెళ్తారు.