ఉద్యానవన పంటలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలి: శ్రీకాంత్ రెడ్డి

ఉద్యానవన పంటలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలి: శ్రీకాంత్ రెడ్డి

  • డిడి వజ్రశ్రీ కి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచన

ఆర్.బి.ఎం: ఉద్యానవన పంటలను ప్రోత్సహించేలా ఉద్యానవన శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ డి డి వజ్రశ్రీకి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం రాయచోటీలో ని తన కార్యాలయంలో ఉద్యానవన శాఖ డి డి వజ్రశ్రీ తో ఉద్యానవన పంటలపై సమీక్షించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి ప్రాంతంలో మిల్లెట్ (చిరుధాన్యాలు) ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. చిన్నమండెంలో త్వరలో టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ మరియు కోల్డ్ స్టోరేజీ లను ఏర్పాటుచేయనున్నామన్నారు.ఉద్యన వన పంటలు సాగుచేసే రైతులకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలును ప్రభుత్వం అందిస్తోందన్నారు. డి డి వజ్రశ్రీ మాట్లాడుతూ పారంపాండ్స్, ఫ్యాక్ హౌస్ నిర్మాణాలకు ప్రభుత్వం విరివిగా సబ్సిడీలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి వనిత, వై ఎస్ ఆర్ సిపి నాయకులు జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.