ధర్మస్థాపనా కర్తవ్యానికి స్మృతిచిహ్నమే శ్రీకృష్ణ జన్మాష్టమి: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
ఆర్.బి.ఎం డెస్క్: ధర్మస్థాపనా కర్తవ్యానికి స్మృతిచిహ్నమే శ్రీకృష్ణ జన్మాష్టమి అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.శ్రీకృష్ణతత్వం మానవాళికి విజయమంత్రమన్నారు.వినయం, నిజాయితీ, శ్రమ, ధర్మం, దుర్మార్గాన్ని దూరంగా పెట్టడం వంటివి శ్రీకృష్ణుడు చెప్పిన విజయానికి ఐదు మంత్రాలన్నారు.శ్రీకృష్ణ భగవానుడి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.