ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు,కుమార్తె అమిత్షాతో భేటీ..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్, కూతురు ఇందు ప్రియదర్శిని, హోంమంత్రి అమిత్షాతో బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ తండ్రి రఘురామకృష్ణంరాజుపై వేధింపులకు పాల్పడుతోందని అమిత్షాకు ఫిర్యాదు చేశారు. గత కొద్దీ రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను భారత్, ఇందు అమిత్షాకు వివరించారు. ఈమేరకు ఇద్దరు కలిసి అమిత్షాకు వినతి పత్రం అందజేశారు.
మరోవైపు తన భర్త రఘురామకృష్టంరాజుకు కొంత మందితో ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గుంటూరు జైల్లో తన భర్తను ఉంచిచే ఎలాగైనా చంపేస్తారని ఆమె అన్నారు. రఘురామకృష్టంరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని ఆమె కోరారు.