రేపటి నుండి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు: డీజీపీ

రేపటి నుండి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు: డీజీపీ

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్ :రాష్ట్రంలో లాక్ డౌన్ మరింత కఠినంగా ఉండబోతోందని డీజీపీ పేర్కొన్నారు. రేపటి నుంచి(గురువారం) లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తునట్టు వారు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి అనుమతులు లేకుండా వచ్చే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో డీజీపీ లాక్ డౌన్ అమలుపై సిపి,ఐజి,ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ అధికారులకు సూచించారు. జిల్లా వారీగా లాక్ డౌన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రోజు సమీక్షిస్తున్నారని అయన తెలిపారు. ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు ఒక్కసారిగి రావడంతో దింతో దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతుందని అయన అన్నారు.వ్యాపార సముదాయాల వద్ద ప్రజలు గుమ్మిగూడ కుండా చర్యలు చేపట్టాలని అయన అన్నారు.ఈ క్రమంలో కమిషనర్ స్థాయి నుండి ఏసీపీ స్థాయి అధికారి వరకు రహదారులపై తిరుగుతూ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలనీ డీజీపీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published.